రవితేజ జోడీగా ఆసక్తి చూపని రకుల్ .. తమన్నాకు ఛాన్స్!

  • కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రవితేజ
  • త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే అవకాశం
  • హీరోయిన్ విషయంలో మారిన నిర్ణయం  
ప్రస్తుతం రవితేజ 'టచ్ చేసి చూడు' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే పనిలో వున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన ఏ ప్రాజెక్టు చేయనున్నాడనే విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు గానీ, కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చేయనున్నాడనే టాక్ వినిపిస్తోంది. 'సోగ్గాడే చిన్ని నాయనా' .. 'రారండోయ్ వేడుక చూద్దాం'తో హిట్స్ అందుకున్న కల్యాణ్ కృష్ణ .. వైవిధ్యభరితమైన ఓ కథను రవితేజకు వినిపించి ఓకే అనిపించాడని తెలుస్తోంది. దీంతో త్వరలో సెట్స్ పైకి వెళ్లడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.

ఇక ఈ సినిమాలో కథానాయికగా రకుల్ ను తీసుకుకోవాలని మొదట్లో దర్శకుడు భావించాడు. అయితే, ఆమెను సంప్రదించగా .. ఆమె పెద్దగా ఆసక్తిని చూపలేదట. గతంలో రవితేజతో చేసిన 'కిక్ 2' సక్సెస్ కాకపోవడం అందుకు కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రకుల్ ఇంట్రెస్ట్ చూపకపోవడంతో, రవితేజ జోడీగా తమన్నాను తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారట. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో 'బెంగాల్ టైగర్' వచ్చిన సంగతి తెలిసిందే.  
Go Back to Shorts
raviteja
tamannah

More Telugu News